మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో మేక మాంసం పేరుతో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ఘటనలో ఓ 39 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిషనల్ సూపరింటెండెంట్ మహేష్ చంద్ర జైన్ సోమవారం తెలిపారు.
గత కొద్ది రోజులుగా రావోజీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ తోడా ప్రాంతంలో నిందితుడు మేక మాంస విక్రయిస్టున్నాడని.. అయితే మేక మాసం పేరుతో బీఫ్ విక్రయం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటనపై పక్కా సమాచారం అందడంతో పాటు పలు ఫిర్యాదులు కూడా రావడంతో.. శనివారం పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున బీఫ్ నిల్వాలు ఉండటం గమనించామని.. వెంటనే ఆ మాంసాన్ని సీజ్ చేశామని రావోజీ బజార్ ఎస్ఐ సీమా ధకడ్ తెలిపారు.
కాగా, నిందితుడిపై గతంలో కూడా ఇండోర్, ఉజ్జయిని ప్రాంతంలో MP Cow ProgenySlaughter Prevention Act-2004 కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.