మతం మారుతారా..? దేశం విడిచి పోతారా..? హిందూ కుటుంబాలకు వార్నింగ్‌ ఇచ్చిన..

Spread the love

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్నహిందువుల పరిస్థితి ఘోరంగా ఉంది. రోజురోజుకు ఇస్లామిక్‌ జిహాదీల దాడులు పెరిగిపోతున్నాయి. పాక్‌లో జరుగుతున్న విధంగానే.. హిందూ యువతులను అపహరించుకుపోవడంతో పాటు.. హిందూ ఆలయాలపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రధాన ఆలయాలను ధ్వంసం చేసిన జిహాదీ మూకలు.. తాజాగా హిందువులను మతం మారాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటన అనంతరం అక్కడి హిందువులను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

చిట్టగాంగ్‌ జిల్లాలోని సీతకుందా ప్రాంతంలో నివసిస్తున్న హిందువులకు ఇస్లామిక్‌ జిహాదీ గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. స్థానికంగా నివసిస్తున్న పలు హిందూ కుటుంబాలను ముస్లిం మతంలోకి మారాలంటూ గోడలకు లెటర్‌లను అతికించారు. మతం మారకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆ లెటర్‌లో ఉన్నట్లు బంగ్లాదేశ్‌కి చెందిన ఓ హిందూ యువకుడు ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రేమతలా మున్సిపల్‌ ప్రాంతంలోని నాలుగు హిందూ కుటుంబాలను టార్గెట్‌ చేస్తూ ఈ బెదిరింపు లెటర్‌ ఉన్నట్లు తెలిపాడు. ఈ సంఘటన ఏప్రిల్‌ 13వ తేదీన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు మాత్రం ఎలాంటి యాక్షన్‌ తీసుకోవడం లేదని తెలుస్తోంది. కాగా, హిందువులు ఎక్కువగా నివసించే మరో గ్రామంపై పెద్ద ఎత్తున ఇస్లామిక్‌ జిహాదీ మూకలు మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 8 మందికి పైగా హిందువుల గాయపడ్డారు. అనేక మంది ఇళ్లను ధ్వంసం చేసి లూటీ చేశారు. ఈ ఘటనతో అక్కడి హిందువుల భయంతో వణికిపోతున్నారు. ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో జీవనం కొనసాగిస్తున్నారు. గగనం న్యూస్‌ ప్రత్యేకం.

 


Spread the love
error: Content is protected !!