యావత్ దేశాన్ని ఊపిరాడనీయుకుండా చేస్తున్న చైనీస్ వైరస్ అయిన కరోనాతో పోరాడేందుకు భారత సంస్థలన్నీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లను తయారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రపంచంలోనే తొలి మందును కూడా భారత రక్షణ సంస్థ డీఆర్డీవో తయారు చేసింది. దీనికి 2డీజీ అని నామకరణం కూడా చేసింది. ఇక ఈ చైనీస్ వైరస్తో పోరాడుతున్న వారి కోసం వైద్య పరంగా ఉపయోగించే పరికరాలను ఇస్రో తయారు చేస్తోంది. ఇప్పటికే తక్కువ ధరలోనే లభించే వెంటిలేటర్స్ను ఆవిష్కరించగా.. తాజాగా సెకండ్ వేవ్లో కీలకంగా మారుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను కూడా డెవలప్ చేసింది. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొరత ఉండటంతో.. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాణ్యతలేని చైనీస్ కంపెనీ కాన్సన్ట్రేటర్స్ కూడా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొరతకు చెక్ పెట్టేందుకు ఇస్రో తక్కువ ధరలో నాణ్యమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను రెడీ చేసింది. దీనికి శ్వాస్ అని పేరు కూడా పెట్టారు.
ఇస్రోకు చెందిన యువ సైంటిస్టులు ఈ పోర్టబుల్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను రూపొందించినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దీనికి సంబంధించిన టెక్నాలజీని తయారీ సంస్థలకు ఉచితంగా ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఇస్రో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే పలు సంస్థలు కూడా తమను సంప్రదించినట్లు డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ నిమిషానికి పది లీటర్ల ఆక్సిజన్ను అందిస్తుందని.. అది కూడా 95 శాతం ప్యూర్ ఆక్సిజన్ను అందిస్తుందని పేర్కొన్నారు. ఏక కాలంలో ఇద్దరికి అందించడం దీని ప్రత్యేకత అన్నారు.
బ్రీతింగ్ సమస్యలతో బాధపడేవారికి, ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్న వారికి ఇస్రో డెవలప్ చేసిన ఈ పోర్టబుల్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇవి ప్రెజర్ స్వింగ్ అడ్సర్ప్షన్ (పీఎస్ఏ) పద్దతి ద్వారా పరిసరాల్లోని గాలి నుంచి నైట్రోజన్ను వేరుచేసి ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతాయి.
ఈ పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి ఇస్రో తన వెబ్సైట్లో కూడా పేర్కొంది.