ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు మాత్రం ఇదే అదనుగా మనదేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. LoC వద్ద కాపుకాచి ఉన్న ఉగ్రవాదులు.. సైన్యం కళ్లుగప్పి.. దేశంలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా.. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. వీరి ప్రతి ప్లాన్లను మన ఆర్మీ తిప్పికొడుతోంది. గడిచిన 24 గంటల్లో భద్రతాబలగాలు ఉగ్రవేటలో ఉన్నాయి. ఇప్పటికే ఏకంగా 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వీరిలో శనివారం సౌత్కశ్మీర్లోని బత్పూర ప్రాంతంలో నలుగురిని హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఇక మిగతా ఐదుగురు ఉగ్రవాదులను సరిహద్దుల్లోని కేరాన్ సెక్టార్లో మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్డించాయి.
అయితే ఈ ఉగ్రవేటలో మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ జవాన్ వీరమరణం పొందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన ఇద్దరు జవాన్లకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. భారీగా మంచు పేరుకుపోవడంతో.. ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
In this operation, 1 Indian Army soldier has been lost his life while 2 more are critically injured. Operations to evacuate the injured have been hampered by heavy snow and rough terrain conditions. Operation is still in progress: Army sources https://t.co/BKPo6NiVv9
— ANI (@ANI) April 5, 2020