ఆర్మీ కాన్వాయ్‌పై గ్రేనేడ్‌ ఎటాక్‌.. సీసీ కెమెరాకి చిక్కిన విజువల్స్‌..! వీడియో చూడండి

Spread the love

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై గ్రేనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఆర్మీ కాన్వాయ్‌కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే ఈ ఘటనలో ఆర్మీ కాన్వాయ్‌కు నష్టం వాటిల్లనప్పటికీ.. దారినపోయే ఓ ఆరుగురు పౌరులు గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యింది. ఉగ్రవాదులు అక్కడే ఉన్న ఓ భవనంపై నుంచి దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఆర్మీ కాన్వాయ్‌లోని చివరి వెహికిల్‌ డ్రైవర్‌ ఈ సంఘటనను ముందే గుర్తించి వాహనాన్ని నిలిపినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. గ్రేనేడ్‌ పేలుడుతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.


Spread the love
error: Content is protected !!