కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం.. ఎలానో చెప్పేసిన జనసేనాని..!

Spread the love

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు.. మంగళవారం రాత్రి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు  మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనా అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని నిర్ణయంపై స్పందించారు. మెదీ తీసుకున్న 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయాన్ని అందరు తమ విధిగా పాటించాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను, ఆదేశాలను అంతా పాటించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరేం చేయలేమని.. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్స్ చేసి సహాయాన్ని పొందాలని సూచించారు. ప్రధాని మాటను పాటించి.. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దామని తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రధాని మాట పాటిద్దాం – కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం…
Please follow 21 days lock out.. pic.twitter.com/Ep8qFvGIf2

— Pawan Kalyan (@PawanKalyan) March 24, 2020


Spread the love
error: Content is protected !!