జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హిందూ ఆలయాలపై వరుస దాడులను నిరసిస్తూ.. గురువారం నాడు ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు నల్ల బ్యాడ్జీని ధరించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా.. బీజేపీ-జనసేన సంయుక్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉన్న జనసేనాని తన ఇంటి నుంచే ధర్మ పరిపరక్షణ దీక్ష చేపట్టారు.
మరోవైపు ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీజేపీ-జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.