జియో.. టెలికాం రంగంలో అనతికాలంలోనే వినియోగదారులను ఆకట్టుకున్న నెట్వర్క్.. అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుని.. పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లను పెంచుకున్న సంస్థ. అయితే ప్రస్తుతం డాటా ఆఫర్లు ఈ జియోలో ఉన్నంత తక్కువ మరే ఇతర వాటిలో లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో గజగజవణికిపోతున్నాయి. అనేక కంపెనీలు వారి ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని చెప్తున్నారు. ఈ క్రమంలో డేటా ఉపయోగించుకోవడం తప్పనిసరి. అయితే పలు సంస్థలు ఇంటర్నెట్ ప్రోవైడ్ చేసినా.. మరికొన్ని మాత్రం ఉద్యోగిపైనే వదిలేశారు. ఈ క్రమంలో జియో.. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకోసం.. ఓ కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది.
ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు.. రోజుకు 2జీబీ డేటా వినయోగించుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 51 రోజులు. టారీఫ్ ధర..రూ.251గా నిర్ణయించింది. అయితే 2 జీబీ డాటా ముగిసిన తర్వాత.. డేటా వేగం తగ్గుతుంది. 64 కేబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు.అయితే ఈ పథకంలో కేవలం డేటా మాత్రమే ఉంది. ఎస్సెమ్మెస్,కాల్స్ చేసుకునే సదుపాయాలు లేవు. అయితే బీఎస్ఎన్ఎల్ కూడా ఓ ఆఫర్ ప్రకటించింది. న్యూ కనెక్షన్ తీసుకొనే వారికి ఒక నెల ఫ్రీగా బ్యాడ్బ్యాండ్ సేవలు అందజేస్తామని వెల్లడించింది.
అయితే.. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్స్లో ఉన్న కస్టమర్లు.. ఇతర నెట్ వర్క్కు కాల్స్ చేసుకునేందుకు ప్రత్యేక టారీఫ్లు ఉన్నాయని తెలిపింది. దీంతో టాక్టైమ్తో పాటు అదనంగా డాటా కూడా వస్తుందని పేర్కొంది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 టారీఫ్లతో రీఛార్జ్ చేసుకొనే వారికి.. 75,200,500,1000 నిమిషాల టాక్టైమ్తో పాటు.. 800 ఎంబీ, 2 జీబీ,
6జీబీ, 12 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు.