బ్రేకింగ్‌.. కశ్మీర్‌లో న్యాయవాదిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

Spread the love

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా లోయలో ఉన్న ప్రముఖులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా గురువారం నాడు శ్రీనగర్‌కు చెందిన ఓ అడ్వకేట్‌ను దారుణంగా హతమార్చారు. శ్రీనరగ్‌లోని హవాల్‌ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది బాబర్ ఖాద్రీని ఉగ్రవాదులు కాల్చిచంపారు.

సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అడ్వకేట్‌ ఇంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తగా భద్రతా బలగాలను మొహరించారు. సమీప ప్రాంతాల్లో కూబింగ్ చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Spread the love
error: Content is protected !!