అయోధ్య రామ మందిర నిర్మాణానికి చెక్‌ రూపంలో నిధి సమర్పించిన కార్పోరేటర్‌ రాజ్‌కుమార్‌

Spread the love

శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతోంది. జనవరి 20వ తేదీ బుదవారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి సమర్పణ అభియాన్ చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌కు చెందిన 1వ డివిజన్‌ కార్పోరేటర్‌ మకారపు రాజ్‌కుమార్‌ రామ మందిర నిర్మాణానికి తన వంతుగా శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్రానికి రూ.10వేల రూపాయల చెక్‌ను సమర్పించారు. కార్పోరేటర్‌ తన సతీమణి పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆమె చేతుల మీదుగా జవహర్‌ నగర్‌ సంచలన సమితి సభ్యులకు చెక్‌ను అందింపజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్‌ సంచలన సమితి సంయోజక్‌ దేవేందర్‌ గారు, సంచలన సమితి సభ్యులు సంతోష్‌ గుప్తా, జోగారావు,రామ కృష్ణ, నిధి ప్రముఖ్ సతీష్‌, మల్కాజ్‌గిరి జిల్లా సంచలన సమితి కో కన్వీనర్‌ రజినీ కాంత్‌ పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!