#JusticeForHaraha.. నిందితులను బహిరంగంగా ఉరి తీయాల్సిందే..

Spread the love

* మల్కాజ్ గిరి జిల్లా బజరంగ్ దళ్ – వీహెచ్పీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

 

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను జిహాదీ మూకలు అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటనను నిరసిస్తూ.. బుధవారం సాయంత్రం బజరంగ్ దళ్ – విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హర్షాను హత్యచేసిన నిందితులను భహిరంగంగా ఉరి తీయాలని జిల్లా కార్యదర్శి రజినీకాంత్ అన్నారు.

దేశంలో మరో హిందూ సోదరుడి పైన జిహాదీ మూకలు దాడి చేయకుండా ఉండాలంటే ఉగ్రవాద భావ జాలాన్ని రెచ్చగొట్టే SDPI,PFI వంటి సంస్థలను నిషేధించాలని.. కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బజరంగ్ దళ్ కన్వీనర్ సుమంత్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ప్రఖండ బజరంగ్ దళ్ సమ్యోజక్ అరుణ్, ఖండ ప్రముఖ్ సాకేత్, అభి, సన్నీ జిల్లా బజరంగ్ దళ్ కార్యకర్తలు సురేష్, శ్రీశైలం, శ్రీకాంత్, రాకేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!