మేఘాలయాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు కాళీ మాతా మందిరాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన మేఘాలయాలోని వెస్ట్ గరో హిల్స్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆలయంపై దాడి జరిగి వారం రోజులకు పైగా కావోస్తున్న ఇప్పటి వరకు దాడి చేసిందెవరన్నది మాత్రం తెలియరాలేదు. జిల్లాలోని మెరెన్గపర గ్రామంలో కొండ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంపై గత వారం రోజుల క్రితం దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఆగస్టు 21వ తేదీన జరిగినట్లు చెబుతుంటే.. స్తానికులు కొందరు ఆగస్టు 16వ తేదీన జరిగిందని చెబుతున్నారు.
ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చిందని.. ఆ తర్వాతే పోలీసులు ఘటనపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. ఘటన జరిగిన గ్రామం.. హల్దీబరీకి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం చరనతల మేళా వార్షికోత్సవం కూడా జరుగుతుందని సమాచారం. అయితే స్థానికంగా ఉన్న హిందూ సంఘాలు.. విగ్రహాలను ఆరాధించని వారే ఈ దారుణానాకి ఒడిగట్టారంటూ ఆరోపిస్తున్నారు.