కర్ణాటక రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో హుబ్బళ్లికి చెందిన ఓ యువతిని దారుణంగా నరికి చంపాడు ఫయాజ్.
పూర్తి వివరాల్లోకి వెళితే .. హుబ్బళ్లి లోని బీవీబీ కాలేజీలో నేహా అనే యువతి (24) చదువుతోంది. ఈ యువతి తండ్రి స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్. అయితే నేహాను ప్రేముంచాలంటూ ఫయాజ్ అనే వ్యక్తి వెంటపడుతున్నడు. అతడు కూడా నేహా చదువుకుంటున్న కాలేజ్ లో సీనియర్ అని తెలుస్తుంది.కర్ణాటక
గత కొంత కాలంగా ఫయాజ్ నేహాని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నాడని.. ఈ క్రమంలో పలుమార్లు ఆమె ఫయాజ్ ప్రేమను తిరస్కరించింది. అయినప్పటికి కూడా వినకుండా ఆమె వెంట పడుతూ పగ పెంచుకున్న ఫయాజ్గు..గురువారం నేహపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు.
నేహా కళాశాల నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉన్న ఫయాజ్.. ఆమె బయటకు రాగానే ఒక్కసారిగా మీద పడి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుమార్లు పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు ఫయాజ్ ను పట్టుకున్నారు. కాగా, ఈ దారుణ హాత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Karnataka: Mohd Fayaz proposed Neha, studying in same college, for relationship, but she denied his proposal.
He stabbed her 9 times on her neck for refusing his advances! Neha was the daughter of a Congress leader. pic.twitter.com/4iecLXnb5I
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 18, 2024
దాడి ఘటన తర్వాత నేహాను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ఆమెను రక్షించడానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.మరోవైపు నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి