తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలతో పాటుగా.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కమలం గూటికి చేరుతున్నారు. మంగళవారం నాడు.. కన్నడ “సింగం”గా పేరుపొందిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై కుప్పుస్వామి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురగన్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
కాగా, బీజేపీ పార్టీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని.. తనకు అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెల్పుతున్నానన్నారు. పార్టీ బలపేతోనానికి ఓ సైనికుడిలా పనిచేస్తానన్నారు.