దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలసిందే.ఈ క్రమంలో తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ను కంటిన్యూ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతేకాదు.. ఏప్రిల్ 30వ తేదీ తర్వాత.. దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఈ 15రోజులు అంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలని..ఈ దశలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ లాక్డౌన్ సమయంలో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలన్నింటికి మాత్రం.. మినహాయింపు ఉంటుందన్నారు. అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. ఇక ఈ ఏడాది విద్యార్ధులకు వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనా దెబ్బకు జరగలేకుండా వాయిదా పడ్డాయి. అయితే ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు.. పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు ప్రమోట్ చేస్తామని వెల్లడించారు. ఇక టెన్త్ పరీక్షల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇంకా… మిగతా ముఖ్యాంశాలు ఏంటంటే..
* ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 503
* మృతి చెందిన వారి సంఖ్య 14
* డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 96
*ప్రస్తుతం యాక్టివ్ ఉన్న కేసుల సంఖ్య 393
*క్వారంటైన్లో ఉన్న వారు 1600
*ఎవరికీ ప్రమాదం లేదు
*రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ 243 ప్రాంతాలు గుర్తింపు
*ఏప్రిల్ 24 వరకు క్వారంటైన్ కంటైన్మెంట్ బ్యాచ్ మొత్తం క్లోజ్ అవుతుంది