అవినితీ అక్రమాస్తుల కేసుల్లో పట్టుబడ్డ కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే ఆయన్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న ఘటనలో నాగరాజు నిందితుడిగా ఉన్నారు.దాదాపు నెల రోజులుగా ఈ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.