కిన్నెర వాయిద్య కళాకరుడు మొగులయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వాయించే పన్నెండుమెట్ల కిన్నెరను గుర్తిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించింది. అయితే ప్రభుత్వం గుర్తించినప్పటికీ.. ఆయన మాత్రం కొందరికే సుపరిచితుడిగా ఉండగా.. ఇటీవల పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్లో పాట పాడటంతో ఒక్కసారిగా రెండు తెలుగురాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవ్వడమే కాకుండా.. కిన్నెర వాయిద్యం గురించి అందరికీ మరోసారి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బస్సు సేవలను ప్రశంసిస్తూ.. సమాజంలో ఆ బస్సుకు ఉన్న బంధాన్ని వర్ణిస్తూ ఓ పాట పాడారు. ఆ పాట కూడా ఫుల్ వైరల్ అవ్వడంతో ఆర్టీసీ సంస్థ మొగులయ్యను సత్కరించింది. అంతేకాదు.. ఆయనకు ఉచిత బస్ పాస్ వసతిని కల్పించింది.
♦ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు.
♦ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఆశువుగా ఓ పాట పాడారు.
♦కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది.@tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/XgBxm7Bfjy— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 25, 2021