షాకింగ్‌.. కోట్ల రూపాయల విలువగల హిందూ దేవీదేవతల విగ్రహాల పట్టివేత..!

Spread the love

వెస్ట్ బెంగాల్‌లో కోట్ల రూపాయల విలువగల పురాతన హిందూ దేవీదేవతల విగ్రహాలు పట్టుబడ్డాయి. కోల్‌కతాకు చెందిన కస్టమ్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రంలోని సౌత్ దినాజ్‌పూర్‌ జిల్లాలోని బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతం కలియాన్‌ గంజ్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వరిగడ్డితో వస్తున్న ఓ ట్రక్కును తనిఖీ చేయగా.. అందులో ఉన్న పురాతన విగ్రహాలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. ట్రక్కులో ఉన్న వరిగడ్డి మధ్యలో ఏకంగా 25 పురాతన విగ్రహాలను గుర్తించారు కస్టమ్స్‌ అధికారులు.

పట్టుబడ్డ 25 విగ్రహాల్లో.. పార్వతీదేవీ, మానశా దేవీ, విష్ణుమూర్తి, సూర్య భగవానుడితో పాటు.. మొత్తం ఏడు రాతి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. హిందూ, జైన మతాలకు చెందిన మరో ఏడు కాంస్య విగ్రహాలను కూడా గుర్తించారు. ఇక మరో 11 టెర్రకొట్ట విగ్రహాలుగా గుర్తించారు. ఇవన్నీ క్రీ.శ 9వ శతాబ్ధం నుంచి క్రీ. శ.16వ శతాబ్దానికి చెందినవని అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహాల మొత్తం విలువ రూ.35.3 కోట్లు ఉంటుందన్నారు.

కాగా, ఇప్పటికే మన దేశానికి చెందిన అనేక పురాతన పంచలోహ విగ్రహాలను స్మగ్లర్లు విదేశాలకు తరలిస్తూ అనేకమార్లు తనిఖీల్లో పట్టుబడ్డారు.


Spread the love
error: Content is protected !!