నగరంలోని కాచిగూడ శ్యామ్ బాబా మందిరంలో లక్షయువగల గీతార్చన కార్యక్రమానికి సంబంధిచిన సంపుటి విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరీ గారు, విశ్వహిందూ పరిషత్ అఖిలభారత కార్యకారిని సభ్యులు రాఘవులు గారు, తెలంగాణా ప్రాంత అధ్యక్షులు ఎం.రామరాజు గారు, గీతాచార్యుడు శ్రీ గంగాధరశాస్త్రి గారు, డా.భాస్కరయోగి గారు, ఆచర్య కసిరెడ్డి గారు, తదితర అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి హిందూ యువత వారి శక్తిని కోల్పోతున్నారని.. ఈ తరుణంలో భగవత్ గీత ఒక దిశానిర్దేశం చెసే దిక్సూచి అవుతుందని పెద్దలు అభిప్రాయపడ్డారు.