గీతా పఠనంతో.. భక్తికి భక్తీ.. ముక్తికి ముక్తీ..! అంతేకాదు.. లక్ష యువగళ గీతార్చనతో…

Spread the love

నాగరంలో విశ్వహిందూ పరిషత్ “లక్ష యువగళ గీతార్చన” బ్యానర్ విడుదల 

ప్రతీ హిందువు భగవద్గీత పారాయణం చేయాల్సిందే- నాగారం ప్రథమ పూజారి రామయ్య పంతులు

నాగలింగేశ్వరా దేవాలయంలో లక్ష యువగళ గీతార్చన బ్యానర్ విడుదల

విశ్వ హిందూ పరిషత్ చేపడుతున్న కార్యక్రమంలో ప్రతీ హిందువు పాల్గొనాలని పిలుపు

 

మల్కాజ్ గిరి జిల్లా లోని నాగారంలో ఉన్న నాగ లింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష యువగళ గీతార్చన బ్యానర్ ను నాగారం గ్రామానికి చెందిన ప్రథమ పూజారి, సిద్ధాంతి అయిన రామయ్య పంతులు గారు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ చేపడుతున్న ఈ లక్ష యువగల గీతార్చాన కార్యక్రమంలో ప్రతీ హిందువు పాల్గొనాలని సిద్ధాంతి రామయ్య పంతులు గారు కోరారు. భగవత్ గీత యొక్క విశిష్టతను తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి రజినీకాంత్, జిల్లా సేవా ప్రముఖ్ కమల్ పంత్, నాగారం కార్యదర్శి విజయ్, దమ్మాయి గూడ vhp అధ్యక్షుడు శివాజీ గారు, బజరంగ్ దళ్ సమ్యోజక్ శ్రీశైలం, సురేష్, లక్ష్మణ్, ఓం ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, డిసెంబర్ 14వ తేదీన గీత జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన లక్ష యువ గీతర్చన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి వేలాది మంది పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్ గిరి జిల్లా కార్యదర్శి రజనీకాంత్ పిలుపునిచ్చారు.


Spread the love
error: Content is protected !!