పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పూంచ్ జిల్లాల్లోని క్రిష్ణ ఘటీ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. బుధవారం నాడు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సరిహద్దు వెంట.. మోర్టార్ షెల్స్తో పాటు.. చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు జరపింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన లాన్స్ నాయక్ కర్నైల్ సింగ్ అమరుడయ్యాడు. ఈ విషయాన్ని డిఫెన్స్ పీఆర్వో వెల్లడించారు.
కాగా, గత కొద్ది రోజులుగా లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. నిత్యం కూంబింగ్లు జరుపుతుండటంతో పాటు.. పలువురు ఉగ్రవాదులు అరెస్ట్ అవ్వడంతో.. ఉగ్రవాదుల ప్రాభల్యం తగ్గుముఖం పట్టింది. దీంతో పాక్ సరిహద్దుల మీదుగా లోయలోకి ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడుతోంది.