హుండీ చోరీ కేసు.. షేక్‌ ఇసా, సయ్యద్ అహ్మద్‌ హుస్సేన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు..!

Spread the love

దేవాలయాల్లో హుండీ చోరీ కేసులు విషయంలో తెలంగాణ పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌ ప్రాంతంలో ఉన్న దేవాలయంలో చోరీ జరిగింది. మారుతీనగర్‌లో ఉన్న గౌరీ శంకర్‌ మారుతీ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న హుండీని దొంగిలించారు. హుండీలో దాదాపు రూ.15 వేల నగదు ఉన్నట్లు ఆలయ పూజారి తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులకు సెప్టెంబర్‌ 26వ తేదీన ఫిర్యాదు చేశారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న
పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఆలయ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. దాదాపు 30 సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి.. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హుండీని, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ నిందితులను షేక్ ఇసా(28), సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌(25)లుగా గుర్తించారు. వీరిలో సయ్యద్‌ హుస్సేన్‌ అహ్మద్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆలయాల్లోని హుండీలనే లక్ష్యంగా చేసుకుని వీరి దొంగతనాలకు పాల్పడుతారని పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తానికి దొంగతనం చేసిన ఇద్దరు నిందితులు.. పోలీసుల చేతినుంచి తప్పించుకోలేకపోయారు.


Spread the love
error: Content is protected !!