రెండు రోజుల క్రితం సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మన జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఉత్తరాఖండ్కు చెందిన హవల్దార్ దేవేంద్ర సింగ్ కూడా అమరుడయ్యారు.
ఈ క్రమంలో ఉత్తరాఖండ్లోని అతని స్వగ్రామంలో అతని అంతిమయాత్ర కొనసాగింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ.. అక్కడి ప్రజలు ఆ వీరుడి కుటుంబం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించింది.