హిందువులు ఎన్నో ఏళ్లుగా కలలుగన్న భవ్య రామ మందిర నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్న రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా.. అయోధ్య మందిర నిర్మాణం కోసం పాటుపడిన అగ్రనేత, విశ్వ హిందూ పరిషత్ దిశా నిర్దేశకులు, దివంగత అశోక్ సింఘాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సారథ్యంలోనే అయోధ్య రామ మందిర మూమెంట్ ముందుకు సాగింది. అశోక్ సింఘాల్ లేని లోటును తీర్చేందుకు రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఆయన మేనల్లుడిని కార్యక్రమానికి పిలిచింది. అంతేకాదు.. ఆయన మేనల్లుడు సలీల్ సింఘాల్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో కూర్చోబోతున్నారట. ఈ విషయాన్ని ది ప్రింట్ ప్రచురించింది. సలీల్ సింఘాల్ ఆయన భార్యతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారట. ఈ విషయాన్ని ట్రస్టు సభ్యులు తెల్పినట్లు ది ప్రింట్ పేర్కొంది.
“రామ్ జన్మభూమి ఉద్యమంలో దివంగత నేత అశోక్ సింఘాల్ గారిది కీలక పత్ర. ఈ సమయంలో ఆయన్ను గుర్తు చేసుకోవడంతో పాటు.. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదొక మార్గం” అని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ పూరి అన్నారని ది ప్రింట్ పేర్కొంది.
Late VHP leader Ashok Singhal’s nephew to sit with PM Modi for Ram temple’s ‘bhoomi pujan'
ThePrint's Moushumi Das Gupta @dgupta_moushumi reportshttps://t.co/s97Ekz7Fr6
— ThePrintIndia (@ThePrintIndia) July 28, 2020