గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత నెల ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకడంతో ఆయనకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. గత 50 రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం నాడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.