ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ను నియంత్రిందేకు ఏప్రిల్ 14వరకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణ కాకపోవడంతో.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ను కొనసాగిస్తు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశం వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగనుంది. దేశ ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు.
కాగా.. రెండు రోజుల క్రితం కరోనాను కట్టడి చేసేందుకు మరికొన్ని వారాలు లాక్డౌన్ పొడిగించాలంటూ.. దేశ వ్యాప్తంగా పలువురు సీఎంలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో లాక్డౌన్లోనే కొనసాగనుంది. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు.
ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని.. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తోందని.. లాక్డౌన్ కష్టాలు తట్టుకుని ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకుంటున్నారన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అర్ధంచేసుకోగలనని.. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారిపై భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని.. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉందన్నారు. దేశాన్ని కాపాడుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెల్పుతున్నారన్నారు. ఇక నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన మోదీ.. భారత ప్రజలంతా సమైక్యతను చాటడమే.. అంబేద్కర్కు నిజమైన నివాళి అని అన్నారు. దేశంలో కరోనా నియంత్రణకు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నామని.. ఇతర దేశాలతో పోల్చితే.. మన భారత్ కరోనా నియంత్రిణలో ఎంతో ముందుందన్నారు.
LIVE. Addressing the nation.
Posted by Narendra Modi on Monday, April 13, 2020