*అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద మృతి..!*
*ఉరి వేసుకుని ఉన్నట్టు గుర్తించిన పోలీసులు*
*రూం లో సూసైడ్ నోట్ దొరికిందన్న పోలీసులు*
*శిష్యుడైన ఆనంద్ గిరిపై ఆరోపణ*
*ప్రధాని మోదీ, సీఎం యోగీ సంతాపం*
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద మరణం షాకింగ్ కి గురిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. ఆయన భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతంలో ఉన్న బాఘంబరి మఠంలో గుర్తించారు. ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం.. నరేంద్ర గిరి మహారాజ్ ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 5 పేజీల సూసైడ్ నోట్ కూడా లభ్యం అయినట్లు తెలుస్తోంది. కాగా, సదరు మహారాజ్ తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఈ ఘటనకు బాధ్యుడుగా సూసైడ్ నోట్ లో మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఫోరెన్సిక్ బృదంతో పాటు.. మరో స్పెషల్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతోంది.
ప్రధాని మోదీ, సీఎం యోగీ సంతాపం
కాగా, మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ ఇక లేరనే వార్త విషాదం కలిగించిందని ప్రధాని మోదీ తన ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ కూడా మహంత్ మరణం పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.
"The demise of president of Akhil Bharatiya Akhada Parishad, Mahant Narendra Giri is an irreparable loss for the spiritual world. I pray to Lord Ram to provide his spirit a place at his feet and give strength to his followers to bear this pain," tweets UP CM Yogi Adityanath pic.twitter.com/DR8GAYSlHL
— ANI UP (@ANINewsUP) September 20, 2021
"The demise of president of Akhil Bharatiya Akhada Parishad, Mahant Narendra Giri is extremely saddening," tweets PM Narendra Modi. pic.twitter.com/56Y1FKVr7m
— ANI UP (@ANINewsUP) September 20, 2021