మెగాస్టార్ చిరు ఫస్ట్ ట్వీట్ అదుర్స్.. ఎందుకొచ్చానో చెప్పేశారు..!

Spread the love

మెగా అభిమానులకు ఉగాది సందర్భంగా పండుగలాంటి వార్త అందింది. మెగాస్టార్ చిరంజీవి ఇక తన అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాను ఉగాది పండుగరోజు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకు దూరమున్న చిరు.. బుధవారం నుంచి తన అభిమానులకు దగ్గరయ్యేందుకు డిసైడ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఎందుకు సోషల్ మీడియాను వాడుతున్నారో చెప్పేశారు. తమ అభిమానులకు చేరువగా ఉండేందుకు, అభిప్రాయాలను, సందేశాలను వ్యక్తపరిచేందుకే తాను ఈ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉగాది నుంచి తాను సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అవుతున్నట్లు మంగళవారమే ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్‌ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న సందేశాలను కానీ, చెప్పాలనుకున్నవి ప్రజలతో చెప్పుకోవడానికి కానీ సోషల్‌ మీడియాను ఓ వేదికగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు.. నా తోటి భారతీయులందరితో.. తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉందని తన తొలి ట్వీట్ చేశారు. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని.. ఇంటిపట్టునే ఉంటూ.. సురక్షితంగా ఉందామని తన తొలి ట్వీట్ సందేశాన్ని తెలిపారు.


Spread the love
error: Content is protected !!