పాకిస్తాన్లో హిందువుల జీవనం ప్రశ్నార్ధకంగా మారుతోంది. రోజురోజుకు అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై ముస్లిం సంస్థల దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లోని హిందువులను మూకుమ్మడిగా మతం మారాలంటూ వార్నింగ్లు ఇస్తుండటంతో పలువురు ఇస్లాంలోకి మారిపోయారు. అంతేకాదు.. పలు ప్రాంతాల్లో అయితే మతం మారితేనే రేషన్ అంటూ తేల్చిచెప్తుండటంతో గత్యంతరం లేక.. బలవంతంగా మతం మారిపోతున్నారు. ఇక హిందూ యువతుల అపహరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా వెయ్యి మందికిపైగా అపహరణకు గురవుతున్నారు. అనంతరం బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. లేనిపక్షంలో అత్యాచారం చేసి వదిలేస్తున్నారు.
అయితే తాజాగా దేశంలో కాస్త ధనవంతులుగా ఉన్న హిందూ వ్యాపారులను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు సింధు ప్రాంతంలో ఓ హిందూ వ్యాపారిని పట్టపగలే ముగ్గురు సాయుధులు వచ్చి కాల్చి చంపేశారు. షికర్పూర్లోని గ్రేయిన్ మార్కెట్లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో స్టువర్ట్ గుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పాక్కు చెందిన ఓ పత్రిక రిపోర్టు ప్రకారం.. చనిపోయిన సదరు వ్యాపారి పేరు శంకర్లాల్ అని తెలుస్తోంది. ఓ బైక్పై ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలు, తుపాకులతో వచ్చి.. మార్కెట్కు వెళ్తున్న వ్యాపారి శంకర్లాల్ను పాయింట్ బ్లాక్లో గన్పెట్టి కాల్చిచంపేశారని సదరు పత్రిక పేర్కొంది. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన నిందితుల్లో అహ్మద్ ఖాన్ గోపాంగ్ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
Graphic Content :
A Hindu businessman Shankar lal was killed in Gun Point near Grain Market in Shikarpur, Sindh-Pakistan. pic.twitter.com/qEuuLuzdAD
— Pakistani Hindu Refugees (@hindurefugees) April 18, 2021
ఇదిలావుంటే.. మృతుడికి చెందిన బంధువులు, స్థానిక హిందూ వ్యాపారులు తమకు న్యాయం చేయాలంటూ చౌరానిగ్ జీరో పాయింట్ జైలు వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి చేరుకున్న షికార్పూర్ ఏఎస్పీ సయ్యద్ ఫజుల్ షా.. హామీ ఇవ్వడంతో బాధితులు నిరసనను విరమించుకున్నారు. అయితే అనంతరం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివరిస్తూ.. కేవలం పాత తగాదాల కారణంగా హత్యజరిగిందంటూ చెప్పుకొచ్చారు. మృతుడికి, నిందితులకు మధ్య ల్యాండ్ వివాదం ఉందంటూ చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండానే ఇలా చేసినట్లు సదరు పాక్ డిజిటల్ పత్రిక “brecorder”లో కథనం ప్రచురించింది.
మొత్తానికి ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల జీవనం ప్రశ్నార్ధకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గగనం న్యూస్ ప్రత్యేకం.