గ్రేటర్ ఎన్నికలు నవంబర్లో ఉంటాయంటూ మంత్రి కేటీఆర్ సంకేతాలిచ్చారంటూ వచ్చిన వార్తలపై మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను నవంబర్ 11వ తేదీ తర్వాత గ్రేటర్ పరిధిలో ఎన్నికలు ఉంటాయంటూ వ్యాఖ్యానించినట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట చేశాయని.. అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేదని ట్వీట్లో పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం.. నవంబర్ రెండో వారం అనంతరం గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. అందుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని మాత్రమే తాను అన్నానన్నారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఈసీ పరిధిలోని అంశమని ట్వీట్లో పేర్కొన్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు.. తాను అనని మాటల్ని నాకు ఆపాదించారన్నారు.