మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన CMR ఆస్పత్రిని బుధవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, పలువురు కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆస్పత్రి ఎదుట చెట్లను కూడా నాటారు. ఆస్పత్రికి సంబంధించిన ఓ అంబులెన్స్ను కూడా జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు.