హిందూ దేవాలయాలలోని అమ్మవారి మూర్తులను ధ్వంసం చేసిన మహమ్మద్ రస్సెల్..!!

Spread the love

ముస్లిం ఆధిపత్య దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఓ వైపు హిందువుల పైన దాడులు చేస్తున్న అక్కడి ముస్లిం మత చాందస వాదులు.. మరోవైపు అక్కడి హిందూ దేవాలయాలపై నిరంతరంగా దాడులు చేపడుతున్నారు.

తాజాగా పటుఖాలి జిల్లాలోని 3 హిందూ దేవాలయాల మూర్తిలను పగలగొట్టాడు.. మహమ్మద్ రస్సెల్ అనే యువకుడు. స్థానిక సమాచారం ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం, పటువాఖలి జిల్లా పరిధిలోని గలాచిపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటచేసుకుంది. డకువా గ్రామంలోని హిందూ దేవాలయాలపై పట్టపగలు ముహమ్మద్ రస్సెల్ తన మత విద్వేషాన్ని చూపుతూ.. దాడులకు దిగాడు. రస్సెల్ మొదట ఆ గ్రామంలోని కాళీ దేవాలయంపై దాడి చేసి.. అమ్మవారి చేతిలో ఉన్న కత్తిని తీసుకుని మా కాళీ, మా దుర్గ మూర్తిలను విరగ్గొట్టి పారిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామంలోని మానస అమ్మవారి ఆలయంపై దాడికి పాల్పడ్డాడు. జరిగిన దాడుల గురించి గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ గ్రామానికి చేరుకున్నారు. పోలీస్ అధికారి-స్థానిక స్టేషన్ ఇన్‌చార్జ్ షోనిత్ కుమార్ గయెన్ నేతృత్వంలో గ్రామం మొత్తం గాలింపు చేపట్టి ముహమ్మద్ రస్సెల్‌ను అరెస్టు చేశారు.

అయితే ఈ ఘటనతో స్థానిక హిందువులు భయాందోళనకు గురవతున్నారు. అక్కడి ప్రభుత్వ అధికారులు గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడుతూ.. గ్రామంలో పోలీసులతో భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అక్కడ ఇప్పటికే అనేక గ్రామాలలో హిందువులపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు మైనర్ బాలికలను హిందూ మహిళలను అపహరించుకు పోతూ బలవంతంగా మత మార్పిడి చేస్తూ వివాహం చేసుకుంటున్నారు.

 


Spread the love
error: Content is protected !!