రేపో మాపో ఆస్పత్రి నుంచి తిరిగి వస్తారనుకున్నా.. కానీ ఇలా

Spread the love

గాన గంధర్వుడు బాలు మృతి పట్ల యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. బాల సుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారన్న వార్త విన్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్‌కు గురయ్యారు. కోట్లాది మంది చేసిన ప్రార్ధనల విధి కరుణించలేదంటూ ట్వీట్ చేశారు. ఇక రేపో మాపో ఆస్పత్రి నుంచి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారనుకున్నా బాలసుబ్రహ్మణ్యం.. ఇక లేరన్న వార్త బాధాకరంగా ఉందన్నారు.

ఆయన మరణంతో ఓ అద్బుత సినీ శకం ముగిసిందని.. దేశ చలనచిత్ర రంగానికి ఇది తీరని లోటంటూ ట్వీట్‌లో పేర్కన్నారు. బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Spread the love
error: Content is protected !!