మీకు నాపై అంత ప్రేమ, గౌరవం ఉంటే.. ఆ పని చేయండి.. కానీ ఇలా..!

Spread the love

సోషల్ మీడియాకి హద్దులు లేవన్న సంగతి తెలిసిందే. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు. తాజాగా.. ప్రధాని మోదీ గురించి ఓ తప్పుడు ప్రచారం విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ విషయం ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ప్రచారాన్న తప్పుబట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ వచ్చే ఆదివారంసాయంత్రం 5.00 గంటలకు దేశ ప్రజలంతా ఐదు నిమిషాలపాటు లేచి నిల్చుని.. దేశం కోసం ఎంతో శ్రమిస్తున్న ప్రధాని మోదీకి గౌరవం ప్రకటించాలి అంటూ ఓ మెసెజ్ వైరల్ అవుతోందట.

ఈ ప్రచారం జరుగుతున్న విషయం మోదీ చెవున పడటంతో.. ఆయన స్పందించారు. ఇది తొలుత తనపై బురద జల్లే కార్యక్రమంలా అనిపించిందన్నారు. మరోవైపు ఎవరైనా వ్యక్తులు సదుద్దేశంతోనే ఈ ప్రచారం ప్రారంభించారేమో అని కూడా అనిపించిందన్నారు. అయితే నిజంగా తనపై అంత ప్రేమ, గౌరవం ఉంటే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా సమస్య పూర్తిగా నిర్మూలించేంత వరకు.. ఒక పేద కుటుంబాన్ని బాధ్యత తీసుకోండి అంటూ సూచించారు. దీనికి మించిన గౌరవం మరొకటి ఉండదంటూ.. ప్రధాని తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

मेरे ध्यान में लाया गया है कि कुछ लोग यह मुहिम चला रहे हैं कि 5 मिनट खड़े रहकर मोदी को सम्मानित किया जाए। पहली नजर में तो यह मोदी को विवादों में घसीटने की कोई खुराफात लगती है।

— Narendra Modi (@narendramodi) April 8, 2020


Spread the love
error: Content is protected !!