అగ్రరాజ్యంలో ప్రారంభమైన ఓటింగ్‌.. తొలి ఓటు “బైడెన్‌”కే.. ఏలా తెలిసిందంటే..?

Spread the love

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ల మధ్య ఈ పోరు కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఓటింగ్‌ జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు. ఇక్కడ మొత్తం అయిదు ఓట్లు పోల్‌ అయ్యాయి. అయితే పోలైన ఓట్లన్నీ బైడెన్‌కే పడ్డట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు కనీసం ఒక్క ఓటు కూడా పోల్‌ అవ్వలేదు. డిక్స్‌విల్లీ గ్రామస్థులు డెమోక్రటిక్ అభ్యర్ధి బైడెన్‌కే మొగ్గుచూపారు.

కెనడా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ డిక్స్‌విల్లీ నాచ్ గ్రామం ఉంటుంది. 1960వ సంవత్సరం నుంచి ఈ గ్రామం నుంచే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో గ్రామం మిల్స్‌ఫీల్డ్‌లో కూడా ఓటింగ్‌ జరిగింది. ఇక్కడ ట్రంప్‌కు 16 ఓట్లు పోలవ్వగా.. బైడెన్‌కు 5 ఓట్లు ఖాతాలో పడ్డాయి.

కాగా, గతంలో డిక్స్‌విల్లీ గ్రామానికి చెందిన ఓటర్లు హిల్లరీ క్లింటన్‌కు ఓట్లు వేయగా.. ట్రంప్‌ గెలిచారు. మరి ఈ సారి బైడెన్‌కు ఓట్లు వేయడం జరిగింది. మరి బైడెన్‌ గెలుస్తారా..? లేక ట్రంప్‌ గెలుస్తారా అన్నది వేచి చూడాలి. ఇక ఈ అటవీ ప్రాంతంలోని మరో గ్రామం హార్ట్స్‌ కరోనా ప్రభావంతో ఎన్నికల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. అమెరికాలో జ‌రిగిన ముంద‌స్తు ఓటింగ్‌ ప్రక్రియలో.. ఇప్ప‌టికే ప‌ది కోట్లకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఓపీనియన్‌ పోల్స్‌లో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. ట్రంప్‌ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Spread the love
error: Content is protected !!