దీపావళి పండుగ రాబోతున్న వేళ.. హిందువులకు ఓ షాకింగ్ న్యూస్.ప్రముఖ పండుగల్లో హిందువులకు దీపావళి కూడా పెద్ద పండుగే. ఈ పండుగ వేళ దేశ వ్యాప్తంగా పటాకులు కాల్చుతూ సంబరాలు జరుపుకుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. అంతేకాదు.. ఇంటి ముందర దీపాలు వెలిగిస్తూ.. అమావాస్య చీకట్లను ప్రాలదోరుతుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పండుగల వేళ.. పలు ఆంక్షలతో పండుగవేళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ.. పటాకులు కాల్చే క్రమంలో ఆంక్షలు ఉంటుండటంతో
పండుగ సంబరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ముఖ్యంగా దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో పటాకులు కాల్చే దానిపై సస్పెన్స్ నెలకొంది.ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా ఈ దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులను వాడటాన్ని నిషేధానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాయు కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో భాగంగా ఈ నవంబర్ నెల 7వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పటాకులు కాల్చడంపై నిషేధం విధించాలన్నదానిపై ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతోపాటుగా.. ఢిల్లీ, హర్యానా, యూపీ,రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ),ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఢిల్లీ, హర్యానా,యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా సహాయపడేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీనియర్ అడ్వకేట్ రాజ్ పంజ్వానీ, అడ్వకేట్ శిభానీ ఘోష్ను ఎన్జీటీ నియమించింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న క్రమంలో.. గాలి నాణ్యత సంతృప్తికరంగా లేని సమయంలో.. పటాకులు పేల్చడం ద్వారా మరింత కాలుష్యం పెరుగుతోందని.. దీనిని ప్రభుత్వాలు అరికట్టాలంటూ డియన్ సోషల్ రెస్పాన్స్బిలిటీ నెట్వర్క్కి చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి పటిషన్ దాఖలు చేశారు. దీనిని ట్రిబ్యునల్ విచారించింది. పండుగ సమయంలో వాయు కాలుష్యం ద్వారా.. కరోనా కేసులు పెరుగుతాయని.. కేంద్ర ఆరోగ్య మంత్రి, ఢిల్లీ ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనలను ఈ పిటిషన్కు అటాచ్ చేశారు.