మళ్లీ కోర్టు మెట్లెక్కిన నిర్భయ దోషి.. తప్పించుకునేందుకు ఈ సారి మరో ప్లాన్..

Spread the love

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన గురించి తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులకు పడ్డ ఉరిశిక్ష ఇప్పటి వరకు మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా దోషులకు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు అయిపోయాయి. అయితే ఎలాగైనా ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు గేమ్ ఆడుతున్నారు. మొన్నటికి మొన్న.. లాయర్‌ తమిరిని తప్పుదోవ పట్టించారంటూ గతంలో న్యాయసలహాలిచ్చిన న్యాయవాదిపై ఫిర్యాదు చేశాడు. మరోకరు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలంటూ విజ్క్షప్తి చేశాడు. తాజాగా శుక్రవారం దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ.. ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ని తిరస్కరించడంలో విధానపరమైన లోపం ఉందని పేర్కొంటూ.. హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు మళ్లీ ఏం తీర్పు ఇవ్వబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Spread the love
error: Content is protected !!