బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హిందువులు దేశంలోని షియా ముస్లింలను రక్షించే బాధ్యత (రాజ్యంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం..) ఉందంటూ ట్వీట్ చేశారు. పాకిస్థాన్లో షియా తెగకు చెందిన వారిపై కుట్ర పూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. షియా తెగకు చెందిన వారు రామ మందిర సమస్య వచ్చినప్పుడు రామ భక్తులకు షియాకు చెందిన వారు సపోర్ట్ ఇచ్చారంటూ ట్వీట్లో పేర్కొన్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా పాక్లో షియాలకు, సున్నీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యన్ స్వామి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.