పాకిస్థాన్ తన వక్రబుద్దిని పోనిచ్చుకోలేదు. చైనా ప్రలోభాలకు లొంగిపోతూ.. నేపాల్, పాక్లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే భారత్లోని పలు ప్రాంతాలను నేపాల్ తన మ్యాప్లో చూపిస్తూ
మంత్రి వర్గ ఆమోధం పొంది.. ఆ తర్వాత వాటిని యూఎన్కు కూడా పంపింది. ఇదంతా జిత్తుల మారి నక్క డ్రగన్ కనుసన్నళ మేరకే నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు పాక్ కూడా అదే బాటలో నడుస్తోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం నాడు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన మంత్రి వర్గం కొత్త మ్యాప్ను ఆమోదించింది. ఈ మ్యాప్లో జమ్ముకశ్మీర్, లదాఖ్లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్లోని కోస్తా ప్రాంతాలు తమవేనంటూ ఆ మ్యాప్లో పేర్కొంది.
ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అందులో మ్యాప్కు సంబంధించి మాట్లాడుతూ.. పాక్ విడుదల చేసిన కొత్త మ్యాప్ కశ్మీరల ప్రజల ఆంకాక్షలకు ప్రతిబింబిస్తోందంటూ వ్యాఖ్యానించాడు. ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు తమ దేశ మ్యాప్ను పెడుతున్నామంటూ చెప్తూ.. దీనికి పాక్ మంత్రి వర్గం, ప్రతిపక్షాలు బలపరుస్తున్నట్లు తెలిపాడు.
కాగా, ఆగస్టు 5వ తేదీన గతేడాది.. జమ్ముకశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కశ్మీర్ విషయంలో భారత్ గతేడాది
చేపట్టిన చట్ట విరుద్ద చర్యను నేడు పాక్ కొత్త మ్యాప్ ద్వారా రద్దు చేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదంతా.. డ్రాగన్ కంట్రీ కన్నింగ్ ప్లాన్స్తోనే ఇలాంటి దుస్సాహాసాలకు పాల్పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.