కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్సనల్ వెబ్సైట్ హ్యాక్కు గురైంది. పాకిస్థాన్కు చెందిన హ్యాకర్లు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే వెబ్సైట్ హ్యాక్కు గురైనట్లు గుర్తించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటించింది.
ప్రస్తుతం వెబ్ సైట్ “టెంపరరీ అన్అవైలబల్” అని కన్పిస్తోందన్నారు. అయితే వెబ్సైట్లో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లేదని.. కేవలం కిషన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు, వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ కథనంలో పేర్కొంది.