భారత్‌ బాటలో పాక్‌.. కానీ తాత్కాలికమేనట..!

Spread the love

భారత్‌పై నిత్యం విషం చిమ్మే పాక్‌.. ఒక్క విషయంలో మాత్రం భారత్ బాటలో అడుగులు వేసింది. అదేం శాంతి మార్గం కోసమైతే కాదు కానీ.. సోషల్ మీడియా యాప్‌ విషయంలో. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ టిక్‌టాక్‌ గురించి తెలిసిందే. భారత్‌లో ఓ ఊపు ఊపిన ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుడి భద్రత విషయంతో పాటుగా.. సరైన గైడ్‌లైన్స్‌ ఫాలో కావడం లేదన్న కారణంగా దీనిపై నిషేధం విధించింది. మరో విషయం ఏంటంటే ఇది చైనాకు చెందిన యాప్‌ కావడంతో పాటు.. గాల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో చైనాకు ఆర్ధికంగా దెబ్బ కొట్టేందుకే భారత్‌ ఈ విధంగా నిషేధం విధించిందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ మొత్తానికి భారత్‌ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా పరోక్షంగా స్వాగతించాయి. ఎందుకంటే ఆ దేశాలు కూడా ఈ యాప్‌పై నిషేధం విధించేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా పాక్‌ కూడా శుక్రవారం నాడు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ టిక్‌టాక్‌ యాప్‌లో అభ్యంతర కంటెంట్‌పై అనేక కంప్లైంట్స్‌ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ తెలిపింది. టిక్‌టాక్ సంస్థ నుంచి రిప్లై కోసం వేచిచూస్తున్నామని.. ఇప్పటికే పలు మార్లు కంప్లైంట్ చేసినప్పటికీ.. టిక్‌టాక్‌ సంస్థ పట్టించుకోలేదని పేర్కొంది.


Spread the love
error: Content is protected !!