రాఫెల్‌ వస్తుందని తెలిసి కూడా.. కవ్వింపులకు పాల్పడుతున్న పాక్..

Spread the love

పాక్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దువెంట కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని మేంధర్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడుతోంది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్‌కు ధీటుగా జవాబిస్తోంది.

కాగా, ఓ వైపు కాల్పులకు తెగబడుతూ.. మరోవైపు దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సరిహద్దు వెంట ఉగ్రవాదులు పొంచి ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.

 


Spread the love
error: Content is protected !!