పాక్ మతాధికారి వింత వ్యాఖ్యలు.. కరోనా నిద్రపోతుందట.. అంతేకాదు..

Spread the love

పాకిస్థాన్‌కి చెందిన ఓ మతాధికారి కరోనా గురించి ఓ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో కరోనా జీవిత చరిత్ర గురించి వర్ణించాడు. అది ఎప్పుడు నిద్రపోతుంది..? ఎప్పుడు చనిపోతుంది అన్నది చెప్పుకొచ్చాడు. వైరస్ గురించి చేసిన ఆ వింత వ్యాఖ్యలు పాక్‌ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. కరోనా మనకు సోకకుండా ఉండాలంటే.. ఎక్కువగా
నిద్రపోవాలని చెప్పుకొచ్చాడు. ప్రజలు ఎక్కువగా నిద్రపోతే.. కరోనా వైరస్ కూడా నిద్రపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వింత వ్యాఖ్యలు విన్న అక్కడి వారు నోరెళ్లబెట్టారు. వైరస్ ఎంటి నిద్రపోవడమేంటని ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. మనం మరణిస్తే వైరస్ కూడా మరణిస్తుందని.. ఈ విషయాన్ని వైద్యులే చెప్పారని వ్యాఖ్య చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. సదరు మతాధికారి చేసిన వ్యాఖ్యలపట్ల వింత వింత కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.


Spread the love
error: Content is protected !!