పాకిస్థాన్కి చెందిన ఓ మతాధికారి కరోనా గురించి ఓ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో కరోనా జీవిత చరిత్ర గురించి వర్ణించాడు. అది ఎప్పుడు నిద్రపోతుంది..? ఎప్పుడు చనిపోతుంది అన్నది చెప్పుకొచ్చాడు. వైరస్ గురించి చేసిన ఆ వింత వ్యాఖ్యలు పాక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. కరోనా మనకు సోకకుండా ఉండాలంటే.. ఎక్కువగా
నిద్రపోవాలని చెప్పుకొచ్చాడు. ప్రజలు ఎక్కువగా నిద్రపోతే.. కరోనా వైరస్ కూడా నిద్రపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వింత వ్యాఖ్యలు విన్న అక్కడి వారు నోరెళ్లబెట్టారు. వైరస్ ఎంటి నిద్రపోవడమేంటని ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. మనం మరణిస్తే వైరస్ కూడా మరణిస్తుందని.. ఈ విషయాన్ని వైద్యులే చెప్పారని వ్యాఖ్య చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. సదరు మతాధికారి చేసిన వ్యాఖ్యలపట్ల వింత వింత కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
When we sleep, virus sleeps. When we die, virus dies. Simple. pic.twitter.com/F3cDrEzOZV
— Naila Inayat नायला इनायत (@nailainayat) June 13, 2020