పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. పరిస్థితి గమనిస్తుంటే.. అక్కడ హిందువులు మిగిలి ఉంటారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతి ఏటా వెయ్యి మందికి పైగా హిందూ యువతులను, బాలికలను కిడ్నాప్ చేస్తూ.. బలవంతంగా మతం మార్చి వివాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మాట వినకపోతే హతమార్చుతూ.. వికృత క్రీడకు తెరలేపుతున్నారు. అంతేకాదు నిరుపేద హిందూ కుటుంబాలను టార్గెట్ చేసుకుని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు. ఇక ధనవంతులైన హిందూ వ్యాపారులను కుట్రపూరితంగా దాడులకు దిగుతూ హతమార్చుతున్నారు. ఇలా వరుసగా మైనార్టీలైన హిందువులపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి.
అయితే తాజాగా ఓ బాలుడు శవమై తేలడం కలకలం రేపుతోంది. 8వ తరగతి చదువుకుంటున్న నజూ కుమార్ అనే బాలుడిని ఇటీవల దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాలుడిని చిత్ర హింసలకు గురిచేసి హతమార్చారు. ఏప్రిల్ 23వ తేదీన హజీ అబ్దుల్లా రూండ్ అనే గ్రామ సమీపంలో ఆ బాలుడి శవం కన్పించింది. అయితే ఇది స్థానిక ముస్లిం యువత పనేనంటూ అక్కడి హిందువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొందరు నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ.. పాక్లో ఉన్న హిందువులు భారత్కు రావాలంటూ పోస్టులు చేస్తున్నారు. “నో ఫ్యూచర్ ఇన్ పాకిస్తాన్.. ప్లీజ్ కమ్ టూ ఇండియా” అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.
Graphic Content :
Yesterday evening, the 8th class student, Najoo Kumar Kolhi, was found dead in the village of Haji Abdullah Rund, Najoo Kumar was first kidnapped, then allegedly tortured him, then Murdered. pic.twitter.com/TrirDNvSYW
— Pakistani Hindu Refugees (@hindurefugees) April 24, 2021