కరోనాకు చెక్ పెట్టేందుకు పతంజలి ముందడుగు వేసింది. ఇటీవల కరోనాకు ఆయుర్వేదం ద్వారా చెక్ పెట్టవచ్చని.. తాము మెడిసిన్ తయారు చేశామని పతంజలి సీఈవో బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో ఐదురోజుల్లో సాక్ష్యాలతో సహా.. మీడియా ముందు ఉంచుతామని వెల్లడించారు. అయితే చెప్పిన గడువుకు మరో నాలుగైదు రోజులు అటూ ఇటూ అయినప్పటికీ.. నేడు మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తన ట్విట్టర్లో సోమవారం నాడు పోస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన వివరాలను…హరిద్వార్లోని పతంజలి యోగా పీఠం వేదికగా తెలియజేయనున్నట్లు ప్రకటించారు. వీటికి #SWASARI_VATI, #CORONIL, అని పేరు
పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మెడిసిన్ ఉపయోగించడం ద్వారా.. 5-14 రోజుల వ్యవధిలో కరోనా రోగులు కోలుకుంటున్నారని తెలిపారు. దీనిపై క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించినట్లు ఆచార్య బాలకృష్ణ తెలిపారు. కరోనాకు ఆయుర్వేదంలో వచ్చిన తొలిమెడిసిన్ ఇదే కానుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయత గురించి ఇవాళ వివరించనున్నారు.
#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ कल दोपहर 12 बजे #पतंजलि योगपीठ हरिद्वार से लॉन्च कर रहे है🙏🏻 pic.twitter.com/SQ5cXOzHVB
— Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020