ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్లను కలగి ఉంది ఈ సంస్థ. అయితే ఈ సంస్థకు సంబంధించిన ఓ రెండు యాప్స్ను గూగుల్ సంస్థ.. తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ తన సంస్థకు సంబంధించిన రూల్స్ను ఉల్లంఘించిందన్న కారణంగా పేటీఎంకు సంబంధించిన పేటీఎం యాప్తో పాటు.. పేటీఎం ఫస్ట్ గేమ్స్ను కూడా రిమూవ్ చేసింది. అయితే పేటీఎం మాల్ యాప్తో పాటు పేటీఎం మనీ, పేటీఎం బిజినెస్ యాప్స్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్లో అలాగే ఉన్నాయి.
గ్యాంబ్లింగ్ రూల్స్ను బ్రేక్ చేశారన్న క్రమంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పేటీఎంకు గూగుల్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో విషయం తెలిసన పేటీఎం యూజర్స్ ఆందోళనకు గురయ్యారు. దీంతో పేటీఎం తన అధికారిక ట్విట్టర్ ద్వారా పేటీఎం యూజర్స్ సందేశాన్ని తెలిపింది. ప్రస్తుతం పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదని.. అంతేకాదు అప్డేడ్ చేసుకునేందుకు కూడా అవకాశం లేదని పేర్కొంది. అయితే ఇది తాత్కాలికమేనని.. త్వరలోనే ఈ సేవలు పునఃప్రారంభమవుతాయని ట్విట్టర్లో పేర్కొంది.
“ప్రస్తుతం మొబైల్లో ఉన్న యాప్ను రెగ్యులర్గా ఉపయోగించినట్లు యూజ్ చేసుకోవచ్చిన.. అందులో ఉన్న మీ డబ్బులు కూడా జాగ్రత్తగా ఉంటాయని (All your money is completely safe)” ట్వీట్లో స్పష్టం చేసింది. సో ఎప్పటిలాగే మీరు యాప్ను ఉపయోగించుకోవాలంటూ ట్వీట్లో కోరింది.