దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన ముందు అతి పెద్ద సవాల్ ఉందని.. ధైర్యంతో దీనిని అధిగమించాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సెకండ్ వేవ్లో ఎంతో మంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయారన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత అన్ని ప్రాంతాల్లో ఉందని.. అయితే డిమాండ్కు తగ్గట్లుగానే ఉత్పత్తి కూడా ఉందని తెలిపారు. అవసరం ఉన్న ప్రతి చోటకి ఆక్సిజన్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు కూడా ఆక్సిజన్ను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇక ప్రస్తుతం దేశంలో రెండు స్వదేశీ వ్యాక్సిన్లు తయారీ జరుగుతున్న విషయం తెలిసిందేనని.. ఇప్పటికే 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ ప్రజలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దమైందని తెలిపారు.
India with two 'made in India' vaccines started the world's largest vaccination program. Till now, more than 12 crore vaccine doses have been administered. From 1st May, those above the age of 18 years can be vaccinated: PM Modi pic.twitter.com/qZ6oCddjth
— ANI (@ANI) April 20, 2021