భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రపంచంలో తెలియని వారుండరు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓటమన్న విషయమే తెలియదు. గుజరాత్ రాష్ట్రానికి వరుసగా పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన.. ఎంపీగా పోటీచేసిన తొలిసారే ప్రధాని పీఠాన్ని అదిరోహించారు. తొలిసారి పోటిచేసిన సమయంలో రెండు చోట్ల నుంచి పోటీ చేసి విజయ కేతనం ఎగురవేశారు. ఆ తర్వాత ఒకచోట రాజీనామా చేసి.. వారణాసి నుంచి కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ వారణాసి నుంచి పోటీకి దిగి అఖండ విజయాన్ని సాధించి.. రెండో సారి భారత ప్రధాని పగ్గాలు చేపట్టారు. తొలిసారి ప్రధాని అయ్యాక ఆయను ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇటు సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా అన్ని సోషల్
మీడియా అకౌంట్లలో ఆయనకు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా.. ఆయన ట్విట్టర్ అకౌంట్ను అగ్రరాజ్యం అమెరికా కూడా ఫాలో అవుతోంది.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ ప్రధాని మోదీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవుతోంది. అయితే ఇందులో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే.. వైట్ హౌస్ ట్విట్టర్ అకౌంట్ మొత్తం 19 మందిని ఫాలో అవుతోంది. అందులో 14 మంది అమెరికాన్ల అకౌంట్లు ఉన్నాయి. మిగిలిన ఐదుగురు భారత్కు సంబంధించివే అకౌంట్లే ఉన్నాయి. అందులో ప్రధాని మోదీ, పీఎంవో కార్యాలయం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ యూఎస్ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా అకౌంట్లను మాత్రమే వైట్ హౌస్ ఫాలో అవుతోంది. దీన్నిబట్టి చూస్తుంటే.. అగ్రరాజ్యం మన భారత్కు ఇస్తున్న ప్రాధాన్యత ఎంటో అర్ధమవుతోందని ఇండియన్ నెటిజన్లు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ సంకేతాలు భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయని సూచిస్తున్నాయని పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతేడాది అమెరికా టూర్కి భారత ప్రధాని మోదీ వెళ్లినప్పుడు.. అక్కడ హౌడీ మోదీ కార్యక్రమం.. ఆ తర్వాత ఇటీవల ట్రంప్ భారత్కు వచ్చినప్పుడు.. నమస్తే ట్రంప్ కార్యక్రమాలు.. ఇదరు దేశాల మధ్య మిత్రత్వాన్ని మరింత బలపర్చాయి. అంతే కాదు.. గత వారం రోజులుగా కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యం.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని కోరడం.. దానికి ప్రధాని మోదీ ఒకే చెప్పడం కూడా తెలిసిందే. మోదీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చేందుకు సరేనన్న విషయం తెలియడంతోనే.. భారత్పై ట్రంప్ ప్రశంసల వర్షం కురించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్,మోదీల స్నేహం కారణంగా.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ఇప్పుడు భారతీయులను ఫాలో అవ్వడం విశేషం. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణమంటూ నెటిజన్లు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.