దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు. ఈ కరోనా మహమ్మారి తుఫాన్లా విరుచుకుపడుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మనం అతి పెద్ద సవాల్ను ఎదర్కొంటున్నామన్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ అంశంపై స్పందించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తుండటంతో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ అనే అంశాన్ని చివరి అస్త్రంగా భావించాలన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితేనే.. లాక్డౌన్ అనేది విధించాలన్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లను గుర్తించి అక్కడ లాక్డౌన్పై దృష్టి సారించాలన్నారు. ఇక వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు వెళ్లకుండా చూడాలని.. వారు ఉన్నచోటనే వారికి వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారికి వ్యాక్సినేషన్ అక్కడే వేసేలా చూడాలని ప్రధాని మోదీ సూచించారు.
I urge the States to consider lockdowns only as the last option and focus creating on micro containment zones: PM Narendra Modi pic.twitter.com/B1CnFlNsIj
— ANI (@ANI) April 20, 2021