వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రధాని మోదీ.. ప్రజలకు ఇచ్చిన సందేశమిదే..!

Spread the love

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు కరోనా వ్యాక్సిన్‌ తొలి డోస్‌ వేయించుకున్నారు. తొలి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ అందిన తర్వాత దేశ ప్రజలకు అందజేస్తామని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే తొలిడ్రైవ్‌ ముగిసిన తర్వాత.. రెండో డ్రైవ్‌లోనే ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం ఉదయం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయితే దేశంలో సిరం సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌తో పాటు.. కోవాక్జిన్‌ కూడా వేస్తున్నారు. ఇందులో భారత ప్రధాని మోదీ మాత్రం భారత్‌ బయోటెక్‌ మరియు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌( ఐసీఎంఆర్‌) డెవలప్‌ చేసిన కోవాక్జిన్‌ టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని.. కలిసి కట్టుగా భారత్‌ను కరోనా రహిత దేశంగా తీర్చిదదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు.. 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.


Spread the love
error: Content is protected !!